రైతుల ఖాతాల్లోకి నగదు

రైతుల ఖాతాల్లోకి నగదు

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం కింద సోమవారం సాయంత్రానికి ప్రతి రైతు కుటుంబం ఖాతాలో వెయ్యి రూపాయలు జ‌మ చేయనున్నట్లు ఆర్టీజీఎస్ సీఈఓ అహ్మద్‌బాబు తెలిపారు. దీనిపై జిల్లా క‌లెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దీనికి సంబంధించిన మార్గద‌ర్శకాలను వ్యవసాయ‌శాఖ ముఖ్య కార్యద‌ర్శి రాజ‌శేఖ‌ర్‌, ఆర్టీజీఎస్ సీఈవో బాబు వివరించారు. అన్నదాత సుఖీభ‌వ కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేశామని, మొబైల్ అప్లికేష‌న్ కూడా సిద్ధం చేశామని వివరించారు. అధికారుల‌కు ప్రత్యేక‌మైన లాగిన్‌లు ఇచ్చామని మొత్తం న‌గ‌దు బది‌లీ కూడా పార‌ద‌ర్శకంగా ఉంటుందన్నారు. ఆధార్ అనుసంధానిత చెల్లింపు వార‌ధి ద్వారా నిర్వహిస్తామన్నారు. http://annadathasukhibhava.ap.gov.in లింక్ ద్వారా వివరాలు చూడొచ్చని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos