మాజీ క్రికెటర్ సతీమణి పర్సు, ఫోన్ చోరీ

  • In Crime
  • January 21, 2019
  • 136 Views
మాజీ క్రికెటర్ సతీమణి పర్సు, ఫోన్ చోరీ

ప్రముఖ మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ సతీమణి, బాలీవుడ్ సినిమా నటి ఫర్హీన్ పర్సు, మొబైల్ ఫోన్ ను దొంగలు చోరీ చేసిన ఘటన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది. ఢిల్లీలోని సర్వప్రియ విహార్ ప్రాంతంలోని సెలెక్ట్ సిటీ వాక్ మాల్ ను సందర్శించిన ఫర్హీన్ ప్రభాకర్ తన కారులో వెళుతుండగా టక్ టక్ గ్యాంగ్ కు చెందిన నలుగురు దొంగలు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆమె కారును చుట్టుముట్టారు. డ్రైవింగ్ చేయడం సరిగా రాదంటూ ఫర్హీన్ ప్రభాకర్ ను దూషిస్తూ ఆమె వద్ద ఉన్న పర్సు, మొబైల్ ఫోన్ లాక్కోని పారిపోయారు. ఫర్హీన్ ప్రభాకర్ పర్సులో 16వేలరూపాయల నగదు, పలు డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్ ఉందని పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దొంగలు ఫర్హీన్ పై దాడికి యత్నించగా దాన్ని అడ్డుకునేందుకు ప్రభాకర్ ప్రయత్నించాడు. దొంగల దాడిలో ఆస్థమా రోగి అయిన ప్రభాకర్ రోడ్డుపై పడిపోగా ఓ ఆర్మీ అధికారి సహాయం చేశారు. పోలీసులు రంగంలోకి దిగగి సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో టక్ టక్ గ్యాంగ్ దొంగల కోసం గాలిస్తున్నామని ఢిల్లీ పోలీసు డీసీపీ విజయకుమార్ చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos