ఎన్నికల సమయంలో గెలవాలడానికి అభ్యర్థులు లేదా కుటుంబ
సభ్యులు మొక్కని దేవుళ్లు,ఇవ్వని హామీలు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.అయితే గెలిచిన అనంతరం
ఇచ్చిన హామీలను,మొక్కులను తీర్చేవారు ఇప్పటికీ ఉన్నారంటే మాత్రం అది అతిశయోక్తే..తెలంగాణ
రాష్ట్రంలోని మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం అప్పాజీపల్లి గ్రామం సర్పంచ్ భర్త శ్రీనివాస్
ఇదే కోవలకి వస్తారు.ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర పంచాయితీ ఎన్నికల్లో శ్రీనివాస్
భార్య స్వరూప అప్పాజిపల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేసారు.తన భార్య విజయం సాధిస్తే తిరుపతికి
వచ్చి 120 మందికి గుండ్లు చేయిస్తానంటూ శ్రీనివాస్ మొక్కుకున్నాడు.ఎన్నికల్లో స్వరూప
విజయం సాధించడంతో కొద్ది రోజుల క్రితం భార్య స్వరూపతో కలసి తిరుపతి వెంకన్నను దర్శించుకున్న
శ్రీనివాస్ 120 మంది గ్రామస్థులకు గుండ్లు చేయించి మొక్కు తీర్చుకున్నారు.ఈ విషయం
ఆలస్యంగా వెలుగు చూడడంతో ప్రస్తుతం శ్రీనివాస్పై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లులు
కురుస్తున్నాయి..