పాదరక్షల అడుగుభాగంలో బంగారం బిస్కెట్లను తరలిస్తున్న వ్యక్తి అరెస్టయ్యాడు దీని విలువ సుమారు రూ.66.2 లక్షలు ఉంటుందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. షార్జా నుంచి ఓ ప్రయాణికుడు సుమారు 2 కిలోల బంగారాన్ని లగేజీలో పెట్టుకొని ఆదివారం ఉదయం మధ్యప్రదేశ్లోని ఇండోర్ విమానాశ్రయంలో దిగాడు. ఇండోర్ నుంచి శంషాబాద్ వెళ్తున్న మరో వ్యక్తికి ఆ బంగారాన్ని అందజేశాడు. సదరు వ్యక్తి ఆ బంగారు బిస్కెట్లను తన పాదరక్షల అడుగుభాగంలో పెట్టుకుని శంషాబాద్ విమానాశ్రయంలో దిగాడు. ఎయిర్పోర్టు నుంచి బయటకు వస్తున్న ఆ ప్రయాణికుడిని డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో బంగారం గుట్టురట్టయ్యింది.