ఆదిలాబాద్: ఆదివాసుల మినీ కుంభమేలా నాగోబా మహాజాతరకు రంగం సిద్ధమైంది. దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన మహోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కేస్లాపూర్ అందంగా ముస్తాబైంది. జాతరలో పాల్గొనేందుకు భారీగా ఆదివాసులు తరలివస్తున్నారు. మర్రిచెట్టు నీడలో ఆదివాసీ సాంప్రదాయ పూజలు కొనసాగుతున్నాయి. మహాపూజ అనంతరం మెస్రం వంశస్థులు అర్ధరాత్రి ఆలయ ప్రవేశం చేయనున్నారు. ఆలయ ప్రవేశంతో జాతర ప్రారంభంకానుంది.