ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను మోసం చేసిన డాక్టర్ను నల్లకుంట పోలీసులు అరెస్టు చేశారు. నల్లకుంటలో నివసిస్తున్న డాక్టర్ సంపత్కుమార్, సంధ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత అమెరికా వెళ్లిపోయారు. వీరికి ఒక కుమార్తె. కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో సంపత్కుమార్ నగరానికి వచ్చాడు. ఆమె భర్తపై గృహహింస చట్టం కింద కేసు పెట్టింది. పెద్దల సమక్షంలో ఆమెతో ఒప్పందం చేసుకున్నాడు. ఇల్లు, రూ. 10 లక్షలు, నెలకు రూ. 25 వేలు మెయింటనెన్స్ కింద ఇస్తానని అంగీకరించాడు. ఇంటిని అమ్మాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఒప్పంద పత్రాలు సమర్పించి కోర్టులో విడాకులు తీసుకొని మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఒప్పందం ప్రకారం ఇస్తానని చెప్పిన వాటిని ఇవ్వకపోవడం, నగదు కోసం చెక్కులు ఇచ్చి రద్దు చేయించడంతో సంధ్య తన సోదరి సుధా మాంత్రితో నల్లకుంట పీఎస్లో ఫిర్యాదు చేయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు సంపత్కుమార్ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు.