భారీ భూకంపం. 18 మంది మృతి

భారీ భూకంపం. 18 మంది మృతి

అంకార: తూర్పు టర్కీలోని ఇలాజిజ్ ప్రావిన్స్, సివ్రిన్ జిల్లాలో సంభవించిన శుక్రవారం రాత్రి సంభవించిన భారీ భూకంపంలో 18 మంది మృతి చెందారు. 500 మందికి పైగా గాయపడ్డారు. భూకంపం తీవ్రత మాపనంపై 6.8గా నమోదైంది. భూ ప్రకంప నలు మొదలు కాగానే జనం భయంతో ఇండ్ల నుంచి వీధుల్లోకి వచ్చి పరుగులు తీశారు. స్వల్ప కాలంలోనే 60 ప్రకంపనలు నమోదైనట్లు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. కూలిన భవనాల్లో చిక్కు కున్న వారిని రక్షించేందుకు సహాయక సిబ్బం ది రంగంలోకి దిగారు. శిథిలాల కింద 30 మంది వరకు చిక్కుకుని పోయి ఉంటారని భావి స్తున్నారు. వంద లాది ఇళ్లు నేల మ ట్ట మయ్యాయి. సిరియా, లెబనాన్లోనూ భూ ప్రకం పనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు .

తాజా సమాచారం

Latest Posts

Featured Videos