ఒంగోలు: ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెం తెదేపా విధానసభ సభ్యుడు డేవిడ్రాజు మంగళవారం తెదేపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వైకాపాలో చేరారు. ఒంగోలు విధానసభ నియోజక వర్గం వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైకాపా తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, అనుచరులు పెద్ద ఎత్తున ఆయన బాటలో నడిచారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పలువురు పాలక పక్ష ప్రజాప్రతినిధులు వరుసగా వైకాపాలో చేరుతుండటం గమనార్హం.