సగం ఉద్యోగాలు మగువలకే

సగం ఉద్యోగాలు మగువలకే

అమరా వతి: పొరుగు సేవల సంస్థ-ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ ఎంప్లాయీస్ అంతర్జాల వేదికను ముఖ్యమంత్రి జగన్మో హన్రెడ్డి మంగళవారం ప్రారంభించారు. పొరుగు సేవల ఉద్యోగాలన్నీ దీని పరిధిలోకి రానున్నాయని తెలిపారు. జీతాల చెల్లిం పులో ఉద్యోగులు మోసాలకు గురి కాకుండా మధ్యవర్తులను పూర్తిగా తొలగించేందుకు అంతర్జాల వేదికను ప్రారంభించినట్లు వివరించారు. పొరుగుసేవల ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారు 50 శాతం మంది ఉండాలని, జిల్లా స్థాయి లో 50 శాతం ఉద్యోగాలు మహిళలకే ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు ఆయా శాఖాధిపతుల సమితి నుంచి డిసెంబర్ 15 కల్లా ఉద్యోగాల జాబితా రావాలని, జనవరి 1 నుంచి నియామక ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos