లైంగిక ఆరోపణలు,ఆశ్రమాల్లో వేధింపుల కేసులు చుట్టుముట్టడంతో భారత్ నుంచి పారిపోయి ట్రినిడాడ్లో కొనుగోలు తాను కొనుగోలు చేసిన దీవిలో తేలిన వివాదాస్పద నిత్యానంద స్వామి ఇప్పుడు తన దీవిని ప్రత్యేక దేశంగా గుర్తించాలన్న డిమాండ్తో పాటు తన దీవికి ప్రత్యేక జెండా,జాతీయ చిహ్నం తయారు చేసుకున్నాడు. ఈక్వెడార్ నుంచి ఓ దీవిని కొనుగోలు చేసుకుని దానికి ‘కైలాస‘ అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే.ఈ దీవిని ఓ ప్రత్యేక దేశంగా గుర్తించాలని కోరుతున్న ఆయన, ఓ పాస్ పోర్ట్ ను, జెండాను, జాతీయ చిహ్నాన్ని కూడా తయారు చేసుకున్నాడు.అంతే కాదు, ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని, కేబినెట్ ను ఏర్పాటు చేశారు. రోజూ మంత్రివర్గ సమావేశాలు కూడా జరుపుతున్నారు. తన దేశానికి ప్రధానిగా ‘మా‘ను నియమించామని, బంగారం, ఎరుపు రంగుల్లో పాస్ పోస్ట్ ఉంటుందని ‘కైలాస‘ వెబ్సైట్ పేర్కొంది.మెరూన్ కలర్లో కనిపిస్తున్న సింహాసనంపై నిత్యానంద కూర్చుని ఉండగా, పక్కన నంది బొమ్మతో జెండాను రూపొందించారు. ‘కైలాస‘లో పది మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. నిత్యానంద కార్యాలయంతో పాటు విదేశీ వ్యవహారాలు, హోమ్, సోషల్ మీడియా, రక్షణ, విద్య, వాణిజ్యం తదితర శాఖలు ఏర్పాటయ్యాయి.కైలాస దేశ రాజ్యాంగంలో 547 పేజీలు ఉన్నాయి. దీన్ని హిందీ.. తమిళం.. సంస్కృత భాషల్లో రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఇక తాను ఇండియాలో హిందుత్వాన్ని ప్రచారం చేస్తున్నందున తన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని అంటున్న నిత్యానంద, తన దేశానికి సరిహద్దులు ఉండవని, ప్రపంచంలోని ఏ దేశపు వారైనా రావచ్చని, పౌరసత్వం కావాలంటే విరాళాలు ఇవ్వాలని అంటున్నారు. ఇతర దేశాలతో దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నామని నిత్యానంద వ్యాఖ్యానించారు.మరింత విచిత్రమైన విషయం ఏమంటే.. నిత్యానంద చెప్పుకుంటున్న కైలాస దేశంలో తాము కూడా పౌరులమని పేర్కొంటూ ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఇప్పటికే సభ్యత్వాలు నమోదు చేసుకోవటం గమనార్హం.