పిల్లల చందాలూ మింగారా బాబూ?

పిల్లల చందాలూ మింగారా బాబూ?

అమరావతి: ‘రాజధాని ఇటుకల కోసం బడి పిల్లల నుంచి వసూలు చేసిన డబ్బు ఏమైంది బాబు గారూ? రియల్ ఎస్టేట్ భూముల విలువ పెంచుకునేందుకు పసివాళ్లని కూడా వదల్లేదు కదా? మీరు వాళ్ల జేబులు ఖాళీ చేస్తే, ఇప్పుడా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు జగన్ గారు.. తేడా తెలుస్తోందా?’ అని వైకాపా ప్రతినిధి విజయసాయి రెడ్డి శనివారం ట్విట్టర్ లో తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. ‘పోలవరం యాత్రలకు చంద్రబాబు చేసిన ఖర్చు రూ. 400 కోట్లు, దొంగ దీక్షలకు మరోరూ. 300 కోట్లు ఊదేశాడు. జగన్ 43 లక్షల మంది విద్యార్థులకు సంచులు పుస్తకాలు బూట్లు, మేజోళ్లు, బెల్ట్ తో కూడిన సంచి ఇచ్చేందుకు చేసిన ఖర్చురూ.650 కోట్లు రూపాయలు. ఏది విజన్ ? ఏది దుబారా?’ అని ఎద్దేవా చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos