అమరావతి : రెండు రోజుల కిందట ఆత్మహత్యకు పాల్పడిన టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు చిన్న కుమార్తె ఉమా మహేశ్వరి ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేపట్టి నిజం నిగ్గు తేల్చాలని వైసీపీ నేత విజయసాయిరెడ్డి బుధవారం ట్వీట్ చేశారు. ‘ఉమా మహేశ్వరి మరణంపై అనుమానాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కూతురు బేలగా ఆత్మహత్య చేసుకుందంటే ఎవరూ నమ్మడం లేదు. మా చంద్రన్న వేధించాడా? లేదంటే ఇంకెవరైనా చంపి ఉరి వేశారా? అన్న అనుమానాలున్నాయ’ని ఆరోపించారు.