రాష్ట్రాల వారీగా పోలింగ్‌ శాతం ఇలా

రాష్ట్రాల వారీగా పోలింగ్‌ శాతం ఇలా

న్యూ ఢిల్లీ : లోక్సభ ఎన్నికలకు రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 13 రాష్ర్టాల్లోని 89 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. దీంతో సామాన్య ప్రజలతో పాటు ప్రముఖులు కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివచ్చి తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.ఈ దశలో 1,206 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 15.88 కోట్ల మంది ఓటర్లు మ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 8.08 కోట్ల మంది పురుషులు, 7.8 కోట్ల మహిళలు ఉన్నారు. వీరికోసం 1.67 లక్షల పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos