భారత్లో అంతర్భాగమైన కశ్మీర్పై,భారత ప్రధాని నరేంద్రమోదీపై నోరుజారిన పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిపై టీమిండియా సారథి కొహ్లి చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అఫ్రిది నెగెటివ్ మనస్తత్వం కలిగిన వ్యక్తి అని రాజ్ కుమార్ శర్మ అన్నారు. ఇండియా టీమ్ లో ఎవరూ అతన్ని పట్టించుకోరని చెప్పారు. క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా ఎవరూ అతన్ని పట్టించుకోలేదని అన్నారు. అఫ్రిదీ ఎప్పుడూ అనవసరమైన మాటలు మాట్లాడుతుంటాడని.. అతన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.హుందాగా ఎలా ప్రవర్తించాలో భారత క్రికెటర్లను చూసి అఫ్రిది నేర్చుకోవాలని కోహ్లీ కూడా అఫ్రిదీ గురించి ఎప్పుడూ మాట్లాడలేదని… ఎందుకంటే అఫ్రిదీ అంత గొప్ప వ్యక్తి కాదని మండిపడ్డారు.కాగా అఫ్రిది వ్యాఖ్యలపై ఇప్పటికే గౌతంగంభీర్,యువరాజ్సింగ్ సహా సురైశ్రైనా,శిఖర్ ధావన్ తదితర క్రికెటర్లు ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే..