లండన్ : నిన్న శిఖర్ ధావన్. నేడు విజయ్ శంకర్. గాయాల కారణంగా ప్రపంచ కప్పు నుంచి విజయ్ శంకర్ నిష్క్రమించాల్సి వచ్చింది. ప్రాక్టీస్ సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో అతని కాలికి గాయమైన సంగతి తెలిసిందే. దీంతో అతను ప్రపంచ కప్పు నుంచి తప్పుకున్నాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అతని స్థానంలో కర్ణాటక బ్యాట్స్ మన్ మాయాంక్ అగర్వాల్ను ఎంపిక చేశారు. ఇప్పటివరకూ ఒక్క వన్డే కూడా ఆడకపోవడంతో ప్రపంచ కప్పునకు అతని ఎంపిక వివాదాస్పదంగా మారింది. గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అతను అరంగేట్రం చేశాడు.