జైపూర్: రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత వసుంధరా రాజే శుక్రవారం ఇక్కడ ఒకింత విస్మయానికి గురయ్యారు. శాసనసభ సమావేశాలకు ఆమె ఆకుపచ్చ రంగు చీర ధరించి వచ్చారు. శాసనసభ నడవలో అడుగుపెడుతున్నుపుడు ఒక ఫోటో జర్నలిస్టు ఆమె పచ్చ చీరను చూసి అప్రయత్నంగా పాకిస్థాన్ అనడంతో ఆమె అవాక్కయ్యారు. ఒకింత గందరగోళానికి గురైన ఆమె, ఆ తర్వాత మామూలుగానే ముందుకు వెళ్లిపోయారు. రాజస్థాన్ అనబోయి పాకిస్థాన్ అనే పదం తన నోటివెంట అప్రయత్నంగా వచ్చినట్టు ఆ తర్వాత ఆ జర్నలిస్టు వివరణ ఇచ్చాడు.