నాని, వంశీలను హతం చే స్తే రూ. 50 లక్షలు నజరానా

నాని, వంశీలను హతం చే స్తే  రూ. 50 లక్షలు నజరానా

అమరావతి : మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను హతం చేస్తే రూ. 50 లక్షలు నగదు బహుమతి ఇస్తానని మధిర మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసు ప్రకటించారు. కమ్మ సంఘం వన సమారాధనలో ఆయన ప్రసంగించారు. ‘ 2004.. తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత… అప్పటి వరకు కమ్మ వారికి, తెదేపాకు ఒక ధైర్యంగా ఉన్న పరిటాల రవి హత్యకు ఆనాటి పాలకులు మొద్దు శ్రీనును రంగంలోకి దించారు. పరిటాల రవీంద్ర ఇప్పుడు బతికి ఉన్నట్టయితే ఇటువంటి పరిస్థితి ఏపీలో వచ్చుండేది కాదు. అందుకే నేరు కోరుకునేది ఏమిటంటే. సమయం ఆసన్నమైంది. మనల్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కులంలో చీడపురుగులైన కొడాలి నాని, వల్లభనేని వంశీ , మదపుటేనుగులా ప్రవర్తిస్తున్న అంబటి రాంబాబు నూ నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఆ పని చేసిన వారికి నా వంతుగా కోసం రూ. 50 లక్షలు ప్రకటిస్తున్నా.మొన్న జరిగిన చరిత్ర హననం మామూలిది కాదు. దానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ప్రతీకారాలను అందరూ చూస్తారు. మనకు జరిగిన అన్యాయాలను ఎదుర్కోవడానికి వ్యూహం కావాలి. కమ్మ కులాలకు చెందిన పెద్దలందరూ కూర్చొని కార్యాచరణ రూపొందించుకోవాల’ని వాసు పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos