ఖండాలు దాటుకొని ప్రపంచ దేశాలన్నింటికి పాకి మరణమృదంగం సృష్టిస్తోన్న కరోనా వైరస్కు మందు కనిపెట్టడానికి 18 నెలల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కానీ ఈ లోపు కరోనా సంక్రమించిన వారికి సరైన చికిత్సను అందించాలని డబ్ల్యూహెచ్వో డైరక్టర్ డాక్టర్ టెడ్రోస్ తెలిపారు. కరోనా బాధితుల ట్రీట్మెంట్లో ఎదురవుతున్న సవాళ్లను అనేక దేశాలు తమతో పంచుకున్నట్లు ఆయన చెప్పారు. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ లేకపోవడం పెద్ద సమస్యగా మారిందన్నారు. ప్రాణాలను రక్షించాలంటే సూట్లు, గ్లౌజ్లు, వెంటిలేటర్లు అత్యవసరం అన్నారు.వైద్య సేవలు అందించే హెల్త్ వర్కర్లు ప్రమాదంలో ఉంటే, మనం అందరి జీవితాలు కూడా ప్రమాదంలో ఉన్నట్లే అని టెడ్రోస్ పేర్కొన్నారు. సంపన్న దేశాల్లో హెల్త్ వర్కర్లు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటాన్నరో.. అలాంటి చర్యలనే చిన్న, మధ్యతరగతి దేశాలు కూడా పాటించాలన్నారు. చాలా దూకుడు పద్ధతిలో కరోనా కేసులను గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కిట్ల ఉత్పత్తి, టెస్టింగ్ను పెంచనున్నట్లు టెడ్రోస్ వెల్లడించారు. కరోనాతో బాధపడుతున్న వారెవ్వరూ స్వంత మందులను వాడకూడదని డబ్ల్యూహెచ్వో హెచ్చరించింది.మందు తయారీ కోసం ప్రపంచదేశాలు ముందుకు వస్తున్నట్లు టెడ్రోస్ తెలిపారు. స్పెయిన్, ఇటలీ పేషెంట్లపై ట్రయల్స్ నిర్వహిస్తున్నామని, ఇది చరిత్రాత్మకమవుతుందన్నారు. ట్రయల్ పద్ధతికి సుమారు 45 దేశాలు సహకారం అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్న దేశాలు ఈ ట్రయల్ పద్ధతికి సహకరిస్తే, అంత త్వరగా కరోనాకు మందును కనుగొనే వీలుందన్నారు. కరోనా మహమ్మారిగా మారుతున్న కొద్దీ.. ఆ వైరస్ కొత్త కొత్త దేశాలకు విస్తరిస్తోందన్నారు. దాని ద్వారా కొత్త కొత్త అంశాలు బయటపడుతున్నట్లు టెడ్రోస్ చెప్పారు. డబ్ల్యూహెచ్వో వెబ్సైట్లో సుమారు 40 గైడెన్స్ డాక్యుమెంట్లు ప్రచురించినట్లు ఆయన తెలిపారు. ఆయా ప్రభుత్వాలు, డాక్టర్లు, హెల్త్ వర్కర్లు, ప్రజలు ఎలాంటి భద్రతలు పాటించాలో వాటిల్లో వివరించినట్లు పేర్కొన్నారు. కోవిడ్19 సంఘీభావ నిధికి సుమారు 108 మిలియన్ డాలర్ల సహాయం అందినట్లు చెప్పారు.
"To support our call on all countries to conduct aggressive case-finding and testing, we’re also working urgently to massively increase the production and capacity for testing around the world"-@DrTedros #COVID19 #coronavirus
— World Health Organization (WHO) (@WHO) March 27, 2020