భాజపా పాలిత రాష్ట్రాలకే అధిక టీకాలు

భాజపా పాలిత రాష్ట్రాలకే అధిక టీకాలు

న్యూ ఢిల్లీ: ప్రధాని మోదీ ప్రభుత్వం కరోనాపై పోరులో వివక్ష చూపించిందని విపక్షాలు గురువారం లోక్సభలో విరుచుకు పడ్డాయి భాజపా పాలిత రాష్ట్రాలకు టీకాలు అధికంగా పంపిణీ చేసి, ఇతర ప్రాంతాలను వదిలేసిందని విమర్శించాయి. కొవిడ్ కట్టడి గురించి గురువారం లోక్సభలో చర్చ జరిగింది. ‘దేశంలోకి కరోనా ప్రవేశించిన 21 నెలల తర్వాత ఈ చర్చ జరగడం దురదృష్టకరం. అది కూడా కేసులు తగ్గిపోయాక చర్చించడం గమనార్హం. కనీసం ఒమిక్రాన్ విషయంలోనైనా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందని భావిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుందని ఆశిస్తున్నా. ప్రధాని అంటే అందరికీ ప్రధానే. మహారాష్ట్రను చిన్నచూపు చూసి, గుజరాత్ను నెత్తి మీద పెట్టుకోవడం మంచిది కాదు. ఎన్నికలు వస్తున్నాయని.. అధిక టీకాలను యూపీకి కేటాయించడం సరికాదు. జనాభాను దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు ఉండాలి,’ అని శివసేన సభ్యుడు వినాయక్ రౌత్ అన్నారు. దేశంలో ఇప్పటివరకు 38శాతం మందికే పూర్తి స్థాయిలో మోతాదులు అందినట్టు పేర్కొన్నారు. మరి ఇంత తొందరగా భాజపా వర్గాలు సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.’రాజకీయాలు చేయకండి..’దేశంలో ప్రస్తుతం ఒమిక్రాన్ భయాలు ఉన్నాయని.. ఈ సమయంలో రాజకీయాలు చేయకూడదని భాజపా సభ్యుడు రతన్ లాల్ కటారియా హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉన్న పాత్ర గొప్పదని, దానికి తగ్గట్టుగా వ్యవహరించాలని పేర్కొన్నారు. మోదీపై నిందలు వేయడం కొందరు రాజకీయ నేతలకు అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos