కాంగ్రెస్ నేత‌ల స‌త్యాగ్ర‌హ దీక్ష‌లు

కాంగ్రెస్ నేత‌ల స‌త్యాగ్ర‌హ దీక్ష‌లు

హైదరాబాద్: కరోనా వేళ రాష్ట్ర సర్కారు తీరుకి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్షలకు దిగారు. ఇక్కడి గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్రెడ్డితో పాటు పలువురు నేతలు దీక్షలో పాల్గొన్నారు. ప్రజలకు కరోనా, బ్లాక్ ఫంగస్ వైద్యం ఉచితంగా అందించాలని, టీకాలు ఉచితంగా వేయాలని డిమాండు చేసారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు గాంధీభవన్తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షలు జరగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేఖరులతో మాట్లాడారు. ‘కరోనా చికిత్స కోసం పేదలు తమకున్న కొద్దిపాటి ఆస్తులను కూడా అమ్ముకోవాల్సి వస్తోంది. పేదలకు ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందించాలి. కరోనా, బ్లాక్ ఫంగస్ చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాల’ని డిమాండ్ చేసారు. కరోనా కట్టడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆగ్రహించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos