అమిత్ షా సవాల్ ను స్వీకరిస్తున్నాం

అమిత్ షా సవాల్ ను స్వీకరిస్తున్నాం

ముంబై: బీజేపీపై ఒంటరిగా సవాల్ చేసి గెలవాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా విసిరిన సవాల్ ను తాము స్వీకరిస్తున్నామని శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్య మంత్రి ఉద్ధవ్ థాకరే అన్నారు.సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘రాజకీయ అవసరాలకు ఆ పార్టీ హిందుత్వను వాడుకుంటోంది. అధికారం కోసం మేమె ప్పుడూ ఆ పని చేయలేదు. రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలో పలు ప్రాంతీయ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. వాటిలో శివసేన ఒకటి. అధికారంలోకి వచ్చిన తర్వాత హిందుత్వ అజెండాను అమలు చేయాలన్న ఉద్దేశంతో మేము బీజేపీతో చేతులు కలిపాం. అంతేకాని అధికారంలోకి రావడం కోసం హిందుత్వను వాడుకోలేదు. బీజీపీ అధి కారం కోసం పాకులాడుతోంది. హిందుత్వ అవకాశవాదిగా మారిపోయింది. అమిత్ షా సవాల్ ను స్వీకరిస్తున్నాం. శివసేనను మహారాష్ట్ర వెలుపల కూడా విస్తరిస్తామ’ని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos