ట్విట్టర్​ ఇండియా అధిపతి, నటి స్వర భాస్కర్​ పై ఫిర్యాదు

ట్విట్టర్​ ఇండియా అధిపతి, నటి స్వర భాస్కర్​ పై ఫిర్యాదు

న్యూ ఢిల్లీ: ట్విట్టర్ భారత అధిపతి మనీశ్ మహేశ్వరితో పాటు ట్విట్టర్ అధికారి ఆసిఫ్ ఖాన్, నటి స్వర భాస్కర్, జర్నలిస్ట్ అర్ఫా ఖానుమ్ షెర్వానీలపై అమిత్ ఆచార్య అనే న్యాయవాది ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా అదే వీడియోకు సంబంధించి అమిత్ ఆచార్య అనే అడ్వొకేట్ ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కొట్టారని, జై శ్రీరామ్ అనాలంటూ దాడి చేశారంటూ పేర్కొన్న ఓ వృద్ధుడి వీడియో నకిలీదని తేలినా మళ్లీ మళ్లీ దాన్ని షేర్ చేస్తు న్నారని ఆరోపించారు. ప్రస్తుతానికి ఇంకా ఎఫ్ ఐఆర్ నమోదు చేయ లేదని వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఓ వార్తా సంస్థ, పలువురు జర్నలిస్టులు, కాంగ్రెస్ నేతలపై కేసు నమోదైంది. రెండు వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఆ వీడియోను వారు పోస్ట్ చేశారని వారిపై ఎఫ్ ఐఆర్ దాఖలైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos