తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామి ఆస్తుల్ని తితిదే శనివారం ఇక్కడ ప్రకటించింది. రూ.15,938 కోట్ల నగదు ధరావత్తు, 10,258.37 కిలోల బంగారం నిల్వలు బ్యాంకుల్లో ఉన్నాయి. తితిదే నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తోందని విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండటంతో తితిదే ఈ ప్రకటన చేసింది. నగలు, నగదును అధిక వడ్దీలు ఇచ్చే జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేస్తున్నామని వెల్లడించింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ బ్యాంకుల్లో స్వామి వారి నగదు, నగలను డిపాజిట్ చేయబోమంటూ తేల్చి చెప్పింది.