బ్రహ్మోత్సవాలు ప్రారంభం​​​​​​​​

తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం అంకురార్పణ జరిగింది. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. భక్తులూ సహకరించాలని కోరారు. తిరుమాడ వీధుల్లో స్వామివారి వాహన సేవలు జరిగే సమయంలో భక్తులు నాణేలు విసరొద్దని విజ్ఞప్తి చేశారు. విసిరే నాణేలు అర్చకులు, వాహనసేవకులను గాయపరిచే అవకాశముందని తెలిపారు. భక్తులు కచ్చితంగా మాస్కులు ధరించాలని, తాగు నీటి కోసం స్టీల్ లోటాలు, సీసాలు తెచ్చుకోవాలని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos