గుండెపోటుతో ట్రంప్ అభిమాని మృతి.

గుండెపోటుతో ట్రంప్ అభిమాని మృతి.

మన ఊరు కాదు.. మన దేశమూ కాదు.. అయిన వాడు అంతకన్నా కాదు.. అయినా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే చెప్పలేనంత అభిమానం.. ఆ అభిమానం హద్దులు మీరి గుడికట్టే వరకు వెళ్లింది. గుండెల్లో పెట్టుకుని ఆరాధించే తన దేవుడికి కరోనా వచ్చిందని తెలియగానే ట్రంప్ ఏమైపోతాడో అని ఆందోళన చెందిన కృష్ణ అనారోగ్యానికి గురయ్యాడు.. ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో తనువు చాలించాడు. జనగామ జిల్లా బచ్చన పేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బుస్స కృష్ణ (33) తల్లిదండ్రులతో కలిసి మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఉంటున్నాడు. 2019 జూన్ 14న ట్రంప్ జన్మదినం సందర్భంగా కొన్నె గ్రామంలోని తన ఇంట్లో ట్రంప్ విగ్రహాన్ని నెలకొల్పి నిత్యం పూజలు నిర్వహించేవాడు. అమెరికా, భారత్‌ మధ్య సంబంధాలు మెరుగు పడాలని కోరుకునేవాడు. ఆ మధ్య ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చినప్పుడు కలుసుకోవాలని విశ్వ ప్రయత్నం చేశాడు.ట్రంప్‌కి కరోనా సోకిందని తెలిసి కృష్ణ తల్లడిల్లిపోయాడు.. తన తండ్రికి కరోనా వచ్చినంతగా ఫీలైపోయాడు.. త్వరగా కోలుకోవాలని ప్రార్థించాడు.ఆహారం కూడా తీసుకోకుండా ట్రంప్ విగ్రహం వద్ద రోదిస్తూ గడిపేవాడు. ఇలా కొన్నిరోజులుగా చేస్తుండడంతో కృష్ణ ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఈ క్రమంలో గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలాడు.కృష్ణ భార్య గతంలోనే మరణించింది. వీరికి ఒక కొడుకు ఉన్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos