తెరాస సభ్యులకు బీమా

తెరాస సభ్యులకు బీమా

హైదరాబాద్‌ : తెరాస సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2 లక్షల ప్రమాద బీమాను కల్పిస్తున్నట్లు ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వెల్లడించారు. దీనికి సంబంధించిన రూ.11.21 లక్షల ప్రీమియం చెక్కును యునైటెడ్‌ ఇండియా బీమా కంపెనీకి అందజేశారు. భవిష్యత్తులో ఎంత మంది సభ్యత్వం తీసుకున్నా, వారికీ బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్‌, మల్లారెడ్డి ప్రభృతులు పాల్గొన్నారు. నెల రోజుల్లోనే 50 లక్షల మందికి పార్టీ సభ్యత్వం ఇవ్వడం ద్వారా రికార్డును సృష్టించామని కేటీఆర్‌ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos