ధాన్యం సేకరణపై కేంద్రాన్ని నిలదీసిన తెరాస

ధాన్యం సేకరణపై కేంద్రాన్ని నిలదీసిన తెరాస

న్యూ ఢిల్లీ: వడ్లు కొనుగోలు పై టీఆర్ఎస్ సభ్యులు సోమవారం లోక్సభలో కేంద్రాన్ని నిలదీశారు. ధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నినాదాలు రాసిన అట్టల్ని సభలో ప్రదర్శించారు. జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాలని, రైతులను శిక్షించరాదని, ఎదు గుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ దార్శనికత వల్ల రైతులకు సమృద్ధిగా సాగునీరు, ఎరువులు, విత్తనాలు, రైతు బంధు వంటి పథకాలు అమల వుతున్నాయని వెల్లడించారు. నాణ్యమైన ఉచిత విద్యుత్ అందడం వల్ల దిగుబడులు పెరిగాయని, అందుకు తగిన విధంగా ఎఫ్ సీఐ కొనుగోళ్లను పెంచాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అవసరమైన విధానాలను తీసుకురావాలని కోరారు. అప్పటివరకు రైతుల కోసం తమ ఆందోళనలు, ఉద్యమం కొనసాగుతాయని టీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos