ఖాకీల తాత్సారానికి శిరో ముండనంతో నిరసన

ఖాకీల తాత్సారానికి శిరో ముండనంతో నిరసన

ఝాన్సీ: తండ్రి హంతకుల్ని పట్టుకోకుండా పోలీసులు తీవ్ర నిర్లక్ష్యాన్ని చేసినందకు నిరసనగా పునీత్ సింగ్ అనే మహిళ ఏకంగా శిరో ముండనం చేయించుకుంది. గత ఆగస్టు 22న ఆమె తండ్రి జోగేందర్ అచేతనంగా పడి ఉండటాన్ని గమనించిన కొందరు పునీత్కు తెలిపాలిరు. ఆమె తండ్రిని ఆసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. తండ్రి సెల్ఫోన్ కనిపించక పోవటాన్నీ గుర్తించింది. తన  తండ్రి నమ్మకస్తుడైప రాజీవ్ ఖండేల్వాల్, ఆయన తన తండ్రిని హత్య చేసారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.కేసు నమోదుకు మొదట పోలీసులు వెనకా డారు. తన తండ్రి హత్యలో పోలీసుల పాత్ర కూడా ఉండొచ్చని ఆరోపించారు. ఎంతకీ అను మానితుల్ని చేయనందుకు నిరసనగా గత రెండు వారాలు గా ప్రతి రోజు గుండు కొట్టించుకుంటూ నిరసిస్తున్నారు. నిందితులను అరెస్టు చేసేంత వరకూ ఇలాగే చేస్తూ ఉంటానని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos