ఈ దీపావళికి టపాసులు పేలేది అనుమానమే..

ఈ దీపావళికి టపాసులు పేలేది అనుమానమే..

దీపావళి పండుగ రోజు బాణసంచా కాల్చడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొన్నేళ్లుగా ఈ బాణసంచా కాల్చడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతున్నదంటూ ప్రకృతి ప్రేమికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కోర్టుకు కూడా వెళ్లారు. ఈ ఏడాది రాజస్థాన్ ప్రభుత్వం కూడా తమ రాష్ట్రంలో బాణసంచా కాల్చడాన్ని నిషేధించినట్టు ప్రకటించింది. ఇదిలా ఉండగా కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో బాణసంచాపై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వానికి గ్రీన్ ట్రిబ్యునల్ సూచించింది. వాయి కాలుష్యం పెరిగితే కరోనా మరింత విజృంభించే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ప్రజారోగ్యం పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా దీపావళి పండుగ సందర్భంగా టపాసుల వాడకాన్ని నిషేధించాలనే ఎన్జీటీ సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ నెల 7 నుంచి 30 వరకు టపాసులు కాల్చడంపై నిషేధించం విధించాలన్న ఆలోచనపై ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ఏకే గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖతోపాటు నాలుగు రాష్ట్ర ప్రభుత్వాల స్పందన కోరింది ఎన్జీటీ. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతోపాటు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ ఢిల్లీ పోలీసు కమిషనర్ ఢిల్లీ హర్యానా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో అమికస్ క్యూరీగా సహాయపడటానికి ఎన్జీటీ సీనియర్ న్యాయవాది రాజ్ పంజ్వానీ న్యాయవాది శిభానీ ఘోష్ను ఎన్జీటీ నియమించింది.ప్రజల ఆరోగ్యం దృష్ట్యా బాణసంచాను నిషేధించాలని సంతోష్ గుప్తా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై ట్రిబ్యునల్ విచారించింది. అయితే గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos