బురారీ హౌస్‌లో ఇప్పుడు ఏముందో తెలుసా!

బురారీ హౌస్‌లో ఇప్పుడు ఏముందో తెలుసా!

గత ఏడాది జులైలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్యకు పాల్పడడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొత్తఢిల్లీలోని బురారీ హౌస్‌ ఆత్మహత్యల ఘటన అనంతరం చాలా కాలం పాటు ఖాళీగా ఉంది.ఆత్మహత్యలకు పాల్పడ్డ 11 మంది ఆత్మలు అక్కడే దెయ్యాలై తిరుగుతున్నాయంటూ వదంతులు వ్యాపించడంతో ఎవరూ అందులో ఉండడానికి సాహసించలేదు.అయితే చాలా రోజుల అనంతరం ఆ భవనంలో కొద్ది రోజుల క్రితం డయాగ్నస్టిక్‌ సెంటర్‌ వెలసింది.తనకు మూఢనమ్మకాలు ఏమీ లేవని అక్కడ రక్త పరీక్షల కేంద్రాన్ని నడిపిస్తున్న డాక్టర్ ఎన్ మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు.తనకు అటువంటి నమ్మకాలే ఉంటే ఇక్కడికి వచ్చేవాడిని కాదని, తన వద్దకు పరీక్షల నిమిత్తం వచ్చే వారికి కూడా ఇంతవరకూ ఎటువంటి సమస్యలూ ఎదురు కాలేదని అన్నారు. ప్రధాన రహదారికి దగ్గరగా ఉండటంతో, తన సెంటర్ చక్కగా పని చేస్తోందని ఆయన తెలిపారు.కాగా, అప్పుడప్పుడూ ఇక్కడికి హిందూ పూజారులు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారని స్థానికులు చెబుతుండటం గమనార్హం. అయితే, పూజలు సాధారణమేనని, గౌరీ, విఘ్నేశ్వర పూజలు చేస్తున్నామని, ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు ఇటువంటి పూజలు సాధారణమేనని డాక్టర్ మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు..

బురారీ హౌస్‌లో వెలసిన డయాగ్నిస్ట్‌క్‌ సెంటర్‌

తాజా సమాచారం

Latest Posts

Featured Videos