కానిస్టేబుల్‌ను కాల్చిచంపిన ఉగ్రవాదులు..24 గంటల్లో రెండో ఘటన

కానిస్టేబుల్‌ను కాల్చిచంపిన ఉగ్రవాదులు..24 గంటల్లో రెండో ఘటన

శ్రీనగర్: పుల్వామాలోని గుడ్రూలో శుక్రవారం ఉదయం కానిస్టేబుల్ రెయాజ్ అహ్మద్ థోకెర్ ని ఉగ్రవాదులు తనిని ఇంటి వద్దే కాల్చిచంపారు. దీంతో గత 24 గంటల్లో ఉగ్రవాదుల ఘాతు కానికి బలైన వారు ఇద్దరు. కాల్పు ల్లో గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు కశ్మీర్ జన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. గురు వారం సాయంత్రం బుద్గాం జిల్లా ఛదూరలోని తహసిల్ కార్యా లయంలో పనిచేస్తున్న కశ్మీర్ పండిట్ రాహుల్ భట్ను ఆఫీసు ఆవరణలోనే ఉగ్రవాదులు కాల్చిచంపారు. దీంతో ఆగ్రహోదగ్రులైన స్థానికులు శ్రీనగర్-బుద్గాం హైవేను దిగ్బంధించడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయి గోళాలు ప్రయోగించారు. ఈ ఘటన సిగ్గుచేటంటూ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించగా, కశ్మీర్లో సాధారణ పరిస్థితి నెలకొందనే భారత ప్రభుత్వ వాదన తప్పనే విషయం రుజువైందని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు. బాధిత కశ్మీర్ పండిట్ కుటుంబాన్ని పరామర్శించాలనుకున్న ఆమెను అధికారులు శుక్రవారం హౌస్ అరెస్ట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos