నైజీరియన్‌ వలలో టాలీవుడ్‌ నటి..

నైజీరియన్‌ వలలో టాలీవుడ్‌ నటి..

బహుమతులు పంపుతున్నామని,కస్టమ్స్‌,ఎయిర్‌పోర్టు అధికారులమని,లాటరీ తగిలిందంటూ వచ్చే ఈమెయిల్స్‌,ఫోన్‌కాల్స్‌తో జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు ఎంతలా మొత్తుకుంటున్నా ప్రజల్లో మార్పు మాత్రం రావడం లేదు.ప్రతీరోజూ ఇటువంటి మోసాలు పదుల సంఖ్యలో వెలుగు చూస్తూనే ఉన్నాయి.తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఓ సెలబ్రిటి కూడా మోసపోయిన ఘటన విస్మయానికి గురి చేస్తోంది.తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటున్న సోనాక్షి వర్మకు గతనెలలో ఫేస్‌బుక్‌లో మెర్రిన్‌ కిర్రాక్‌ అనే నైజీరియా దేశానికి చెందిన వ్యక్తి నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది.ఫ్రెండ్ రిక్వెస్ట్‌ యాక్సెప్ట్‌ చేసిన సోనాక్షి తరచూ మెర్రిక్‌తో సంభాషణలు జరుపుతండేవారు.ఇలా కొద్ది రోజులు ఛాటింగ్‌ చేసి సోనాక్షి వద్ద మంచివాడిగా మార్కులు కొట్టేసిన మెర్రిక్‌ తన పథకాన్ని అమలు చేశాడు.తాను లండన్‌లో ఉంటానని చాలా తక్కువ మందితో స్నేహం చేస్తానని స్నేహితులకు బహుమతులు పంపించడం నాకున్న అలవాటని తెలిపాడు.నీతో స్నేహానికి గుర్తుగా చిరు కానుక పంపిస్తున్నానని మరికొద్ది రోజుల్లో ఢిల్లీ విమానాశ్రయానికి బహుమతి వస్తుందంటూ నమ్మించాడు.మెర్రిక్‌ చెప్పినట్లే గతనెల27వ తేదీన ఢిల్లీ విమానాశ్రయం నుంచి మాట్లాడుతున్నామని మీకు లండన్‌ నుంచి బహుమతి వచ్చిందంటూ ఫోన్‌ చేశారు.మెర్రిక్‌ అనే వ్యక్తి బహుమతులు పంపించాడని అందులో పెద్దమొత్తంలో డాలర్లు ఉన్నాయంటూ నమ్మించాడు.ఈ బాక్స్‌ను హైదరాబాద్‌కు పంపించాలంటే రూ.85వేలు చెల్లించాలంటూ నమ్మించాడు. నిజమేనని నమ్మిన సోనాక్షి ఫోన్‌ చేసిన వ్యక్తి సూచించిన ఖాతాలో రూ.85వేలు జమ చేశారు.ఎన్ని రోజులైనా బహుమతి రాకపోగా అధికారులమంటూ ఫోన్‌ చేసిన నంబరుకు ఫోన్‌ చేసినా మెర్రిక్‌కు ఫోన్‌ చేసినా స్విఛాఫ్‌ రావడంతో మోసపోయినట్లు గుర్తించి సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos