ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదుల హతం

ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదుల హతం

శ్రీనగర్:అనంత్నాగ్ జిల్లా బిజ్ బెహారా పట్టణంలోని గుండ్ బాబా ఖలీల్ ప్రాంతంలో శనివారం ఉదయం భద్రతా బలగాలకు,లష్కరే తోయిబా ఉగ్రవాదులకు మధ్య సంభవించిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్ని క్వైమహ పట్టణానికి చెందిన నవీద్ భట్, అఖీబ్ యాసీన్ భట్లుగా గుర్తించారు.పోలీసులు,సీఆర్పీఎఫ్, సైనికులు సంయుక్తంగా శనివారం ఉదయం గాలింపు చేసినపుడు ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో మన జవాన్లు తిరిగి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు మరణించారు. వారి నుంచి ఒక ఏకే -47,ఒక పిస్టల్,ఇతర మందు గుండుసామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos