తెదేపాకు ఆ నటి గుడ్‌బై..

తెదేపాకు ఆ నటి గుడ్‌బై..

ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూశాక రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఫలితాలు వెలువడ్డ కొద్ది రోజులకే తెదేపా నుంచి వైసీపీ,బీజేపీ,తెరాస పార్టీల్లోకి మొదలైన వలసలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి.ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు మరికొంతమంది కీలకనేతలు, కార్యకర్తలు వైసీపీ,బీజేపీల్లోకి చేరగా తాజాగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, సినీనటి రేవతి చౌదరి తెలుగుదేశం పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయిన రేవతి చౌదరి పార్టీలో చేరే అంశంపై చర్చించారుఅనంతరం మీడియాతో మాట్లాడిన రేవతి చౌదరి త్వరలోనే తాను బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఈనెల 18 తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన ఉన్న నేపథ్యంలో రోజు ఆమె కాషాయి కండువా కప్పుకోనున్నారు.2018లో తెలుగుదేశం పార్టీలో చేరిన రేవతతికి టీడీపీ అధికార ప్రతినిధిగా అవకాశం కూడా ఇచ్చారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos