గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తెలుగు తమ్ముళ్లు షాకిచ్చారు. ట్విట్టర్ వేదికగా వంశీ చంద్రబాబును టార్గెట్ చేస్తే.. అదే రేంజ్లో ఎమ్మెల్యే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ అధినేత బుధవారం హైదరాబాద్ నుంచి ఉండవల్లిలోని నివాసానికి వచ్చారు. ఆయన అమరావతికి వస్తుండటంతో వల్లభనేని వంశీ ట్విట్టర్లో సెటైర్లు పేల్చారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి “పరదేశి” …..!!!.. “అజ్ఞాతవాసి” …..!!!.. తెలంగాణా రాష్ట్ర “నివాసి” …!!!.. మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి అమరావతి పర్యటన సందర్భంగా స్వాగతం-సుస్వాగతం’అంటూ ట్వీట్ చేశారు.చంద్రబాబును వంశీ టార్గెట్ చేయడంతో తెలుగు తమ్ముళ్లు అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు. ‘వైస్సార్సీపీ లో “పరదేశి”…..!!!!!.. రాజకీయ భవిష్యత్ “అజ్ఞాతవాసి”……!!!!.. తెలంగాణా రాష్ట్రంలో ఆస్తులు కాపాడుకునే “పిపాసి”….!!!.. గౌరవ శాసనసభ్యులు శ్రీ వల్లభనేని వంశీ గారికి రాజకీయ వైరాగ్యం సందర్భంగా వందనాలు శుభాభి వందనాలు’అంటూ వీళ్లూ రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్పై వైఎస్సార్సీపీ కార్యకర్తలు తెలుగు తమ్ముళ్ల మధ్య వార్ నడుస్తోంది. వంశీకి ఫేస్బుక్తో పాటూ ట్విట్టర్ అకౌంట్లు ఉన్నాయి.. కానీ ట్విట్టర్లో అప్పుడప్పుడు మాత్రమే ఇలా ట్వీట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి "పరదేశి" …..!!!
"అజ్ఞాతవాసి" …..!!!
తెలంగాణా రాష్ట్ర "నివాసి" …!!!
మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి అమరావతి పర్యటన సందర్భంగా స్వాగతం-సుస్వాగతం.
🙏👏🙏👏🙏👏— Vallabhaneni Vamsi (@DrVVamsi) October 7, 2020
వైస్సార్సీపీ లో "పరదేశి"…..!!!!!
రాజకీయ భవిష్యత్ "అజ్ఞాతవాసి"……!!!!
తెలంగాణా రాష్ట్రంలో ఆస్తులు కాపాడుకునే "పిపాసి"….!!!
గౌరవ శాసనసభ్యులు శ్రీ వల్లభనేని వంశీ గారికి రాజకీయ వైరాగ్యం సందర్భంగా వందనాలు-శుభాభివందనాలు.
💐🙏💐🙏💐🙏— Save Amaravati Save Andhra (@neekenduku9999) October 7, 2020