ఎయిర్‌ ఇండియా టాక్సిబాట్‌

ఎయిర్‌ ఇండియా టాక్సిబాట్‌

ముంబై: ఎయిర్ బస్ కమర్షియల్ విమానాల కోసం ప్రపంచంలోనే తొలిసారిగా ఎయిర్ ఇండియా టాక్సీ బాట్లు ప్రవేశపెట్టింది. ఎయిర్ ఇండియా చైర్మన్ మానేజింగ్ డైరెక్టర్ అశ్వనీ లోహానీ ఇక్కడి విమానాశ్రయంలో మంగళవారం వీటిని లాంఛనంగా ప్రారంభించారు. టాక్సీబాట్ (ట్రాక్టర్ వంటి వాహనం) సాయంతో విమానాన్ని పార్కింగ్ స్థలం నుంచి సునాయసంగా రన్వైపై తీసుకురావచ్చు(టాక్సీయింగ్). టాక్సీబాట్ల రాకమునుపు విమానాన్ని రన్వేపైకి చేర్చాలంటే విమనాం ఇంజన్లను ఆన్ చేయాల్సి వచ్చేది. చాలా ఇంధనాన్ని ఖర్చు చేయాల్సి వచ్చేది. టాక్సీబాట్ల రాకతో టాక్సీయింగ్కు అవసరమయ్యే ఇంధనంలో దాదాపు 85శాతం పొదుపు చేయచ్చొని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి. కర్బన ఉద్గారాల్ని తగ్గించే దిశగా ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుతానికి ఇక్కడి నుంచి వెళ్లే విమానాల కోసమే టాక్సీబాట్లను వినియోగించదలచారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos