కీలక విషయాలు వెల్లడించిన ప్రణీత్‌రావు

కీలక విషయాలు వెల్లడించిన ప్రణీత్‌రావు

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు లో అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్రావు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. ‘‘అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫోన్ టాపింగ్ చేశాను. ఆ సమాచారాన్ని అప్పటి ఉన్నతాధికారులకే ఇచ్చాను.. ప్రజా ప్రతినిధులు. అధికారులు. మీడియా. రియల్ ఎస్టేట్ పెద్దల ఫోన్లను టాప్ చేశాను.. నాపైన ఉన్న ఎస్పీ స్థాయి అధికారులతో పాటు ఎస్ఐబీ చీఫ్ కు సమాచారం ఇచ్చాను.. కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారుల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశాను.. చాలామంది అధికారులు ప్రజా ప్రతినిధుల వాట్సాప్లపై నిఘా పెట్టాను.. అప్పటి మాజీ చీఫ్ ఆదేశాల మేరకు సమాచారాన్ని ధ్వంసం చేశాను.సెల్ ఫోన్లు, హార్డ్ డిస్కులు, వేల సంఖ్యలో పత్రాలను ధ్వంసం చేశాను’’ అంటూ వివరాలు వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos