హైదరాబాదు : విపక్షనేతల తీరు శ్రుతి మించితే నగరంలో తిరగజాలరని లేరని తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఇక్కడ మరే పార్టీకి లేనంత మంది కార్యకర్తల బలం తమకుందని స్పష్టం చేశారు. విపక్షనేతలకు కేటీఆర్ ను తట్టుకునే శక్తే లేదు… కేసీఆర్ ను తట్టుకుంటారా? అని హేళన చేసారు. హైదరాబాదులో చేసిన అభివృద్ధి కనిపిస్తూనే ఉన్నా, విపక్ష నేతలు సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రెండు పడక గదుల ఇళ్లపై ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.