ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎదురుకాల్పులు.. జ‌వాన్ మృతి

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎదురుకాల్పులు.. జ‌వాన్ మృతి

రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో మరోసారి కాల్పుల మోత మోగింది. జవాన్లకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. దంతెవాడ జిల్లా బార్సూర్ పరిధిలోని హందవాడ, హితవాడలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్(డీఆర్జీ) పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. పోలీసుల కదలికలను పసిగట్టిన మావోయిస్టులు.. ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దంతెవాడ డీఆర్జీ కానిస్టేబుల్ జోగరాజ్ కర్మ మృతి చెందాడు. మరో కానిస్టేబుల్ పరశురామ్కు తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్ పరశురామ్ను చికిత్స నిమిత్తం రాయ్పూర్కు తరలించారు. ఎదురుకాల్పులు చోటు చేసుకున్న ప్రాంతంలో బలగాల కూంబింగ్ కొనసాగుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos