కోల్కతా: బీజేపీ శాసనసభ్యుల్లో 24 మంది తిరిగి టీఎంసీలో చేరతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎన్నికలకు కొన్ని నెలల ముందు పార్టీలోకి వచ్చిన సువేందుకు ప్రతిపక్ష నేత పదవి కట్టబెట్టడాన్ని పలువురు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి ముకుల్ రాయ్ టీఎంసీలో చేరారు. 30 మంది భాజపా శాసనసభ్యులు తమతో మంతనాలు సాగిస్తున్నాటీఎంసీ ప్రకటించడం గమనార్హం. అయితే ఎమ్మెల్యేలందరు తమతోనే ఉన్నారని నిరూపించుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు గండి పడింది. సువేందు అధికారి, గవర్నర్ భేటీకి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావటం ఉల్లేఖనార్హం.