మరో నలుగురు తెదేపా సభ్యుల సస్పెన్షన్‌

మరో నలుగురు తెదేపా సభ్యుల సస్పెన్షన్‌

అమరావతి: శాసన సభా కార్యకలాపాలకు అడ్డు తగులు తున్నారనే కారణంతో మరో నలుగురు తెదేపా సభ్యులపై గురువారం సస్పెండ్  వేటు పడింది. రాష్ట్ర విభజన, పునర్వి భజన చట్టంలోని అంశాల గురించి  వాడీ వేడిగా చర్చ జరుగు తున్న దశలో తెలుగుదేశం పార్టీ సభ్యులు వాసుపల్లి గణేష్ బాబు, వెలగపూడి రామకృష్ణ, బెందాళం అశోక్, డోల బాల వీరాంజనేయులను సస్పెండ్ చేయాలని సభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రతిపాదించారు. దీనికి సభాపతి తమ్మినేని సీతారాం సానుకూలంగా స్పందించారు.  సస్పెన్షన్‌ గురువారం  ఒక్క రోజుకు మాత్రమే పిరమితమని ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన వారు సభాపతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తదుపరి వారిని మార్షల్స్‌ బయటకు తరలించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos