కలెక్టరేట్‌ ఎదుట 30 మంది ఆత్మహత్యాయత్నం

కలెక్టరేట్‌ ఎదుట 30 మంది ఆత్మహత్యాయత్నం

నెల్లూరు: నెల్లూరు కలెక్టరేట్ ఎదుట సోమవారం 30 మంది ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని బాధితులు ఆరోపించారు. వారు పురుగుల మందు తాగుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. సామూహిక ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని 15 రోజుల కిందట జిల్లా అధికారులను బాధితులు కోరారు. బాధితుల ఆవేదనను అధికారులు అర్థం చేసుకుంటారో లేదో వేచిచూడాలి. కడప కలెక్టరేట్లో స్పందన కార్యక్రమంలో వెంకటరమణ అనే రైతు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. డెయిరీ కోసం ఐదుగురికి మంజూరు అయిన రూ.28 లక్షల 75 వేలు తన ఖాతాలో జమ చేయలేదని వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం కలెక్టరేట్లో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. దంపతులు పురుగుల మందు తాగబోతుంటే పోలీసులు అడ్డు కున్నారు. అధికారులు భూ సమస్యను పరిష్కరించడం లేదని దంపతులు ఆవేదన చెందారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos