ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:45 గంటలకు సెన్సెక్స్ 865 పాయింట్లు లాభపడి 33,289 వద్ద, నిఫ్టీ 249 పాయింట్లు ఎగబాకి 9,830 వద్ద ఉన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.11 వద్ద దాఖలైంది. జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్ని గడించాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా షేర్లు నష్ట పోయాయి.