బెంగళూరు : ప్రస్తుత ఐపీఎల్లో క్రికెటర్లు సాధించిన అనుభవం ఇంగ్లండ్లో జరుగనున్న ప్రపంచ కప్పులో ఎంతగానో ఉపయోగపడుతుందని రాజస్థాన్ రాయల్స్ సారథి స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. వన్డే ఫార్మాట్లో రాణించడానికి టీ20 ఫార్మాట్ కూడా దోహదపడుతుందని తెలిపాడు. కనుక ప్రపంచ కప్పులో పాల్గొనే క్రికెటర్లు చక్కటి ప్రదర్శన చేస్తారని భావిస్తున్నట్లు చెప్పాడు. ఐపీఎల్ ద్వారా తాను కూడా చాలా అంశాల్లో మెరుగుపడ్డానని వెల్లడించాడు. ప్రత్యర్థి జట్లలో అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొనే అవకాశం ఇక్కడే లభించిందని చెప్పాడు.