రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న యువవైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్యాచారం ఘటనపై ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేశ్ స్పందించారు.ఈ సంఘటన తన హృదయాన్ని కలచి వేసిందని, అత్యంత క్రూరంగా ప్రియాంకా రెడ్డిని అత్యాచారం, హత్య చేశారని.. ఈ ఘటనల వల్ల రోజురోజుకి భయం మరింత పెరిగిపోతుందని అన్నారు. ఇలాంటి దారుణ సంఘటన జరగడంతో.. నాకు ఏ మాట్లాడాలో కూడా తెలీడం లేదు. ఈ ఘటనలో ఎవరిని నిందించాలో కూడా అర్థం కావడం లేదని అన్నారు.మన దేశంలో ఆడవాళ్లకి భద్రత దొరకదా..? రోడ్డు మీద తిరిగే స్వేచ్చ కూడా లేదా అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న సైకోలను వెతికి శిక్షించాలని చెప్పారు. ప్రియాంకా కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.
#RIPPriyankaReddy #JusticeForPriyankaReddy pic.twitter.com/9vCKsbsj1O
— Keerthy Suresh (@KeerthyOfficial) November 29, 2019