బాండ్ల పేరుతో వైట్‌ కాలర్‌ అవినీతి

బాండ్ల పేరుతో వైట్‌ కాలర్‌ అవినీతి

ముంబై : ఎన్నికల బాండ్ల పేరుతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ‘వైట్ కాలర్’ అవినీతికి పాల్పడిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విమర్శించారు. ముంబై శివాజీ పార్కులో ఆదివారం జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ గత పదేండ్లలో విదేశీ పర్యటనలకు వెళ్లడం, అబద్ధాలను ప్రచారం చేయడమే మోదీ పనిగా పెట్టుకున్నారని, దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్నికల బాండ్లతో బీజేపీ అవినీతి కూడా బయటపడిందని అన్నారు. బీజేపీ కన్నా దేశానికి మరో ప్రమాదమేమీ లేదని అన్నారు. ఈ సభలో జమ్ము-కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ప్రసంగించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos