వలస కార్మికులకు తాయిలాలు

వలస కార్మికులకు తాయిలాలు

న్యూ ఢిల్లీ : వివిధ పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, దుకాణాల యాజ మానులు ఇప్పుడు వలస కార్మికుల కోసం నానా పాట్లు పడు తు న్నారు. సొంత ఊళ్ల నుంచి వారిని రప్పించేందుకు నానా రకాల ఆశలు చూపుతున్నారు. వలస కూలీల గ్రామాల పెద్దలతో సంప్రదింపులు జరిపి తిరిగి రప్పించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. తమ దగ్గరకు తిరిగివస్తే వారి భద్రతకు భరోసా కల్పిస్తామని, వారు ఇక్కడకు స్వస్థలాలకు వెళ్లి వచ్చేందుకు ఏర్పాట్లు కూడా చేస్తామని భరోసా ఇస్తున్నట్లు తెలిసింది. ముంబైకి చెందిన ఒక మందుల తయారీ సంస్థకు గత మూడు నెలలుగా కార్మికులు అందుబాటులో లేక పోవటంతో ఉత్పత్తి బాగా కుంటు పడింది. పాత కార్మికులను సంప్రదించి, వారు తిరిగి వచ్చేందుకు బస్సు సౌకర్యాన్ని కల్పించింది. మరికొన్ని సంస్థలే కార్మికులను తిరిగి రప్పించేందుకు వారికి విమానయాన సౌకర్యాల్ని కల్పించేందుకు సిద్ధమవుతున్నాయని తెలిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos