మూడు సోనూ సూద్ రైళ్లు

మూడు సోనూ సూద్ రైళ్లు

ముంబై : కుటుంబ పోషణ కోసం బిహార్, ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చిఇక్కడ ఉంటున్న వలస కార్మికుల్ని గమ్య స్థానాల్నిచేర్చేందుకు సోనూసూద్ మూడు ప్రత్యేక రైళ్లను బుక్ చేశారు. ‘మొదట బస్సులను ఏర్పాటు చేసి కొంతమంది కూలీలను ముంబై నుంచి కర్ణాటక పంపించిన రోజు నుంచి నాకు ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి. నిరంతరం కాల్స్ వస్తున్నాయి. కొందరి కాల్స్, మెస్సేజ్లను మిస్సయ్యాను. అందుకే అందరికీ అందుబాటులో ఉండేలా ఒక టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశాను. ఇప్పటికే చాలామంది మమ్మల్ని సంప్రదించారు. బస్సుల్లో వలస కార్మికులను పంపించే సమయంలో ప్రతి రాష్ట్రం నుంచి అనుమతి తీసుకునే విషయంలో కొంచెం జాప్యం జరుగుతోంది. రైళ్లలో ఒకేసారి ఎక్కువ మందిని పంపించడానికి అవకాశముంటుంది. ఇటీవల మూడు రైళ్లను బుక్ చేశా. ఇలాంటి మహత్తర కార్యక్రమంలో నాకు సాయం చేస్తున్న సినీ పరిశ్రమ, ఇతర రంగాల్లోని స్నేహితులకు ధన్యవాదాల’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos