దిశా నిర్దేశం లేని అగ్నిపథ్

దిశా నిర్దేశం లేని అగ్నిపథ్

న్యూ ఢిల్లీ : దిశానిర్దేశం లేకుండా అగ్నిపథ్ పథకాన్ని రూపొందిం చారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. నిరసన కార్యక్రమాలను అహింస మార్గం లో చేయాలని యువతను కోరారు.దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్న యువతకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ‘అగ్నిపథ్’ పథకాన్ని కేంద్రం ఉపసంహరించుకునే వరకు తమ పార్టీ పోరాడుతుందని తెలిపారు. కొవిడ్ సమస్యలతో బాధపడుతున్న సోనియా గాంధీ సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు న్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, క్రమంగా కోలుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు. కొవిడ్ బారినపడినందున సోనియా జులై 13న ఆసుపత్రిలో చేరారు. దిగువ ఊపిరితిత్తులకు వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos