న్యూఢిల్లీ: వచ్చే మహిళా దినోత్సవాన సామాజిక మాధ్యమాల ఖాతాల్ని వదిలేస్తున్నట్లు చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ ఖాతానుంచి వైదొలగ బోనని ప్రకటించారు. తాజాగా సమాజంలో స్ఫూర్తి నింపిన మహిళలకు తన సామాజిక మాధ్యమ ఖాతాలను ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఇక్కడ ప్రకటించారు.‘ఇలా చేయడం వల్ల కోట్లాదిమంది ప్రేరణ పొందుతారు.ఎవరైనా తమ కథగానీ, తమకు తెలిసిన వారి కథగానీ సమాజంలో మార్పు తీసుకురాగలదని భావిస్తే #SheInspiresUs ట్యాగ్తో ఆ కథలను పంచుకోవాల’ని సూచించారు. వచ్చే మహిళా దినోత్సవాన సామాజిక మాధ్యమాల ఖాతాల్ని వదిలేస్తున్నట్లు చెప్పిన మోదీ ఖాతానుంచి వైదొలగబోనని వివరించటం తెలిసిందే.